Saturday, May 4, 2024

Big Breaking : తల్లి కొడుకుల‌ సెల్ఫీ వీడియో-రామాయంపేట చైర్మన్ సిఐ వేధింపుల వల్లే ఆత్మహత్య

కామారెడ్డి, ప్రభ న్యూస్. . . జిల్లా కేంద్రంలోని న్యూ మహరాజ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నారు తల్లి కొడుకు.. లాడ్జి గదిలో కాల్చుకుని ఆత్మహత్యకి పాల్ప‌డ్డారు. రూమ్ నెంబర్ 203 లో తెల్లవారు జామున పొగలు రావడంతో పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు లాడ్జీ సిబ్బంది. మృతులు గంగం సంతోష్ (35), అతని తల్లి పద్మలు రామాయంపేట్ వాసులుగా గుర్తించిన పోలీసులు.తల్లి వైద్యం కోసం 11 వ తేదీన లాడ్జికి వచ్చిన్నట్టు సమాచారం. సంఘటన స్థలాన్ని పరిశీలించారు డిఎస్పీ సోమనాథం, పట్టణ సీఐ నరేష్. తాము ఆత్మహత్య చేసుకుంటునట్టు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. రామాయంపేట చైర్మన్ సిఐ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నామ‌ని సెల్ఫీ వీడియోలో వెల్లడించారు మృతులు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు కామారెడ్డి పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement