Sunday, April 28, 2024

రూ.200కోట్ల వ‌సూళ్ల‌కి చేరువ‌లో భీమ్లా నాయ‌క్

సాగ‌ర్ కే చంద్ర డైరెక్ష‌న్ లో భీమ్లా నాయ‌క్ చిత్రం తెర‌కెక్కి రిలీజ్ అయింది. ఫిబ్ర‌వ‌రి 25విడుద‌ల‌యిన ఈ చిత్రం రూ.200కోట్ల వ‌సూళ్ల ల‌క్ష్యానికి చేరువ‌గా వ‌చ్చింది. మొదటి మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసుకోగా.. ఆ తర్వాత నుంచి వసూళ్లు తగ్గిపోయాయి. ఈ వారంలోనే రూ.200 కోట్ల మార్క్ ను చేరుకుంటుందా? లేక వచ్చే వారమా? అన్నది చూడాల్సి ఉంది. భీమ్లా నాయక్ మూడు వారాలు పూర్తి చేసుకుంది. ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయన్ అంచనాల మేరకు.. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.192.04 కోట్లను వసూలు చేసింది. మొదటి వారంలో రూ.170.74 కోట్లు, రెండో వారంలో రూ.16.30 కోట్లు రాబట్టుకుంది. ఇక మూడో వారంలో మొదటి రోజు రూ.1.39 కోట్లు, రెండో రోజు రూ.1.54 కోట్లు, మూడో రోజు రూ.1.67 కోట్లు, నాలుగో రోజు రూ.0.40 కోట్లు వెరసి 19వ రోజు చివరకు (16వ తేదీ) మొత్తం రూ.192.04 కోట్లు వసూలయ్యాయి ఈ చిత్రంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, హీరో రానా ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement