Saturday, May 11, 2024

‘కేర‌ళ‌’లో పెరుగుతోన్న క‌రోనా కేసులు

క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టింద‌నుకుంటే కేర‌ళ‌లో కేసులు పెర‌గ‌డం క‌ల‌వ‌రం పెడుతోంది. దాదాపు 41 శాతం కేసులు ఒక్క కేరళలోనే వస్తున్నాయి. కేరళ రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 66,958కి పెరిగినట్టయింది. యాక్టివ్ కేసులు 8,064 ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న క్రియాశీల కేసుల్లోనూ కేరళలోనే ఎక్కువుండడం ఆందోళన కలిగించే అంశం. ఇవాళ్టి నుంచి 12–14 ఏళ్ల పిల్లలకూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. 60 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ప్రికాషన్ డోసును ఇవ్వడం మొదలు పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement