Sunday, May 5, 2024

Exclusive | భయ్యా, మత్​ మారో ముజే.. మహిళను కాలితో తన్నుతూ, రాడ్డుతో బాదిన మృగాళ్లు! (వీడియో)

‘‘భయ్యా.. ముజే మత్ మారో’’ అంటూ ఓ మహిళ హృదయవిదారకంగా విలపిస్తోంది.. ఆ ఏడ్పులు, పెడబొబ్బలు ఆమెను దారుణంగా కొడుతున్న వారిని ఏమాత్రం కదిలించడం లేదు. ఆ పక్కనే అయిదు నెలల పసిబిడ్డ నేలపై పొర్లాడుతూ ఏడుస్తోంది.. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని సాగర్​లో చోటుచేసుకోగా.. సోషల్​ మీడియాలో ఇప్పుడీ వీడియో క్లిప్ చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన జరిగి దాదాపు 20 రోజులు అవుతుండగా, సోషల్​ మీడియా కారణంగా ఈ విషయం బయటి ప్రపంచానికి ఆలస్యంగా తెలిసింది.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఓ మహిళను ముగ్గురు, నలుగురు మగాళ్లు కలిసి దారుణంగా కొడుతున్న వీడియో ఒకటి సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యింది. ఆ మహిళ తన ఐదు నెలల శిశువు నేలపై పడి ఏడుస్తుంటే.. కొంతమంది మగాళ్లు ఆ మహిళను రాడ్‌తో దారుణంగా కొడుతున్నారు. అంతేకాకుండా ఆమె ముఖంపై కాలితో తంతున్నారు. ఈ హృదయ విదారక ఘటన వీడియోలో ఆ మహిళను కొడుతున్నది కొంతమంది దుకాణదారులుగా తెలుస్తోంది.  ఈ వీడియోలో ఆమెను దుకాణం నుంచి బయటికి లాగేయడం,బస్ట్ స్టాండ్ దగ్గర ఆమె ముఖంపై తన్నడం చూడవచ్చు. ఈ క్రమంలో  ఆ మహిళ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ‘భయ్యా మత్ మారో (దయచేసి నన్ను కొట్టవద్దు)’ అంటే ప్రాదేయపడుతోంది.

https://twitter.com/SR_Tmc007/status/1697153572243444099

 

- Advertisement -

కాగా, ఆ మహిళ క్యాంటీన్‌లో పాలు కొనేందుకు బస్టాండ్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇంతలో ఏం జరిగిందో కానీ, ఆ మగాళ్లు అంతా కలిసి ఆమెను కొట్టడం ప్రారంభించారు. ఈ వీడియో క్లిప్​ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఆ మహిళను దారుణంగా కొట్టిన ఘటనపై నిందితులను పట్టుకున్నామని అదనపు పోలీసు సూపరింటెండెంట్​ లోకేష్​ సిన్హా తెలిపారు. నిందితుల్లో ముగ్గురిని – ప్రవీణ్ రైక్వార్ (26), విక్కీ యాదవ్ (20),రాకేష్ ప్రజాపతి (40) గా పోలీసులు గుర్తించారు. వీరిని- గోపాల్‌గంజ్ పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. నిందితులను కోర్టుకు తరలించే ముందు పోలీసులు రోడ్డుపై పరేడ్ నిర్వహించి మరీ జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్టు సమాచారం అందుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement