Wednesday, May 8, 2024

దొంగ పక్షి.. రిపోర్టర్ ఇయర్ ఫోన్స్ ని ఎత్తుకుపోయింది

లైవ్ లో రిపోర్టింగ్ చేస్తున్నాడు ఓ జర్నలిస్ట్. అది కూడా దొంగతనాలపై..అయితే ఇంతలోనే ఓ పక్షి అతని చెవి నుంచి ఇయర్ ఫోన్స్ కొట్టేయడం విచిత్ర సంఘటనగా నిలిచింది. ఈ ఘటన చిలీలో చోటుచేసుకుంది. దేశంలో పెరిగిపోతున్న దొంగతనాలపై చిలీ జర్నలిస్ట్ నికోలస్ క్రమ్ లైవ్ రిపోర్ట్ ఇస్తున్నాడు. టీవీలో వరుస దొంగతనాలపై వివరాలు చెబుతుంటే టీవీలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతోంది. ఇంతలో ఓ రామచిలుక ఎగురుకుంటూ వచ్చి ఆ రిపోర్టర్‌ భుజంపై వాలింది. అయినా అతను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. చిలుక చూసి చూసి ఆయన చెవిలో ఉన్న ఇయర్ బడ్ ను నోట కరుచుకుని ఎగిరిపోయింది. కాస్త ఆలస్యంగా ప్రతిస్పందించిన రిపోర్టర్‌.. తన ఇయర్ బడ్ ను తిరిగి పొందడం కోసం చిలుకను పట్టుకుందామని ప్రయత్నించినా దొరకలేదు. కొంత దూరంలో చిలుక ఇయర్‌ బడ్‌ను పడేసింది. తర్వాత అక్కడికి దగ్గర్లోనే ఇయర్ బడ్ దొరికిందని ఆయన చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement