Monday, April 29, 2024

Spl Story: ఈ ‘మర్యాద’ వెనుక మతలబేంటి?.. సినీ రంగ ప్రముఖులతో బీజేపీ నేతల వరుస భేటీ!

దేశంలోని పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.. సౌత్​లో పాగా వేయాలని ప్లాన్​ వేస్తోంది. దానికి ఇప్పటి నుంచే పన్నాగాలు పన్నుతున్నట్టు తెలుస్తోంది. ఈమధ్య కాలంలో టాలీవుడ్​ హీరోలు ఎన్టీఆర్​, నితిన్​తో బీజేపీ అగ్ర నేతలు భేటీ కావడంపై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. గత వారం హైదరాబాద్​కు వచ్చిన కేంద్ర హోం మంత్రి, పార్టీ అగ్రనేత అమిత్​షా వెళ్తూ వెళ్తూ ఎయిర్​పోర్ట్​ దగ్గరున్న నోవాటెల్​ స్టార్​ హోటల్​లో ఎన్టీఆర్​ను కలిశారు. నైట్​ డిన్నర్​ టైమ్​లో అమిత్​షా, జూనియర్​తో మంతనాలు జరిపారు. ఇవ్వాల నితిన్​తో జేపీ నడ్డా భేటీ అయ్యారు. దీనిపై సోషల్​ మీడియాలో చాలా సెటైర్లు పేలుతున్నయ్​. అవేంటో ఓసారి చదవి తెలుసుకుందాం..

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

జూనియర్​ ఎన్టీఆర్​తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ కావడంపై ఆ పార్టీ లీడర్లు ఇదంతా సినిమా విషయంలో జరిగిందే కానీ, రాజకీయ ప్రాధాన్యం లేదు అని చెప్పారు. అయితే.. దీనిపై సోషల్​ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున ట్రోలింగ్స్​ జరిగాయి. అందులో ఒకటి..

మిత్రోం.. మీ ట్రిపుల్​ ఆర్​ సినిమా చాలా బాగుంది. అందులో మీరు పోషించిన కుమ్రుం భీం పాత్ర కూడా చాలా బాగుంది. దానికి మీరు పెట్టుకున్న టోపీ కూడా ఎంతో బాగుంది. మా వాళ్లు సినిమాని ఆడకుండా అడ్డుకుంటామని చెప్పారు కదా.. దానికి మేమే కారణం. ఆ విషయం మేమే చెప్పాం.. ఇట్లా టాలీవుడ్​లోనే కాదు.. బాలీవుడ్​లోనే మా లీడర్లు ఇట్లానే షారుఖ్​ ఖాన్​, ఇతర నటుల విషయంలో కూడా చేస్తుంటారు. ఎట్లైనా మీరంతా మా పార్టీలోకి రావాలే” లేకుంటే మీ సినిమాలు ఏవీ ఆడకుండా మా లీడర్లు అడ్డుకుంటారు” అని అమిత్​ షా, జూనియర్​ ఎన్టీఆర్​ భేటీలో మాట్లాడుకున్నట్టు సోషల్​ మీడియాలో హల్​ చల్​ అయ్యింది.

దీనిపై పెద్ద ఎత్తున రూమర్స్​ వచ్చినా.. బీజేపీ నేతలు మాత్రం అదేం లేదు.. రాజకీయ కోణంలో దీన్ని చూడొద్దు.. కేవలం మర్యాద పూర్వక భేటీ మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. ఇంకొందరేమో ట్రిపుల్​ ఆర్​ సినిమాలో ఎన్టీఆర్​ నటనను మెచ్చుకునేందుకు అమిత్​షా జూనియర్​ ఎన్టీఆర్​ని పిలిపించారని, అందుకే భేటీ అయ్యారని చెప్పుకొచ్చారు.

- Advertisement -

ఇక.. ఇవ్వాల (శనివారం) వరంగల్​లో జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు రోజు సభకు హాజరైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్​ ప్రకాశ్​ నడ్డా (జేపీ నడ్డా) సభలో ప్రసంగించిన తర్వాత ఎయిర్​పోర్టుకు చేరుకున్నారు. అదే నోవాటెల్​ స్టార్​ హోటల్​లో హీరో నితిన్​తో భేటీ అయ్యారు. దీనిపై కూడా ఆ పార్టీ లీడర్లు ‘‘అదంతా ఏం లేదు. మర్యాద పూర్వక భేటీ మాత్రమే’’ అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే.. అప్పుడు జూనియర్​ ఎన్టీఆర్​ ట్రిపుల్​ఆర్​ సినిమా బాగుందని అమిత్​షా పొగడడానికి పిలిచారు..

ఇప్పుడేమో మాచర్ల నియోజకవర్గం సినిమా చాలా బాగుందని పొగడడానికి జేపీ నడ్డా పిలిచారా? అని సోషల్​ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

అంతేకాకుండా.. బీజేపీలో చేరి, పలు సభలు, సమావేశాలకు అటెండ్​ అవుతున్న సినీ నటి జీవిత గురించి కూడా సోషల్​ మీడియాలో చలోక్తులు పేలుతున్నాయి. జీవితా రాజశేఖర్​ తొలినాళ్లలో నందమూరి లక్ష్మీ పార్వతి వెంట నడిచారు. అన్నా ఎన్టీఆర్​ పార్టీలో లక్ష్మీ పార్వతితో పాటు పర్యటించారు. ఆ తర్వాత వైఎస్​ రాజశేఖరరెడ్డి హయంలో కాంగ్రెస్​లో చేరారు. దాంతర్వాత చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కండువా కప్పుకున్నారు. మళ్లీ వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రాగానే వైసీపీలో జగన్​ పంచన చేరారు. ఇప్పుడేమో బీజేపీలో చేరారు. ఇట్లాంటి ఫొటోలను కలెక్ట్​ చేసి ఫేస్​బుక్​, సోషల్​ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు.

‘‘అన్ని పార్టీలు తిరగండి.
అన్ని పార్టీల సభ్యత్వాలను స్క్రీన్​షాట్​ తీసుకోండి..
మీకు నచ్చిన చోట రాజకీయం చేయండి”
అని  గుండు బాస్​ లలిత జువెల్లర్స్​లో వచ్చే యాడ్​ మాదిరిగా కంపేర్​ చేస్తున్నారు.

అయితే.. ఈ మర్యాద పూర్వక భేటీల వెనుక అసలు మతలబు ఏంటీ? సినీరంగ, క్రీడారంగంలోని ప్రముఖులను పార్టీలో చేర్చుకునే ఎత్తుగడలేనా? అన్న అంశంపై కూడా సోషల్​ మీడియాలో ఎంగడతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement