Sunday, May 19, 2024

బావా నాకోసం వెత‌క‌కు, పిల్ల‌లు జాగ్ర‌త్త‌.. లెట‌ర్ రాసి ఇంట్లోనుంచి వెళ్లిన భార్య‌

బావ నన్ను క్షేమించు. నిన్ను వదిలి వేలుతున్నందుకు ఇంతవరకు నా ఆరోగ్యం కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టవు. ఇంకా నిన్ను బాధ పెట్టదల్చుకోలేదు. అందుకే ఈ నిర్ణయం.. పిల్లలు, మా అక్క జాగ్రత. నాకోసం వేతకకు. నా శంవం కూడా దొరాకుండ దురంగా వెళ్తున్న‌. నువ్వు కట్టిన తాళీ మాత్రమే తిస్కెల్తున్న. ఐ మిస్ యు.. అంటు రాసిన లెట‌ర్ ఇంట్లో లభించింది.

అబ్దుల్లాపూర్ మెట్: తన ఆరోగ్యం గురించి దిగులు చెంది.. మనస్తాపానికి గురై ఉత్తరం రాశి ఇంట్లో నుంచి వేల్లిపోయింది ఓ మ‌హిళ. ఈ సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జ‌రిగింది, ఇన్స్పెక్టర్ వాసం స్వామి, సబ్ ఇన్స్పెక్టర్
డి కరుణాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్ మెట్ మండలం కవాడిపల్లి గ్రామానికి చెందిన బైరోజు భుజంగాచారి కార్పెంట‌ర్గా ప‌నిచేస్తాడు. తన భార్య వాని అలియాస్ మహేశ్వరి (30) గృహిణి. గతంలో పెద్ద అంబర్ పేట మందుల తయారీ కంపెనీలో మ్యాన్పక్షర్ విధులకు వేళ్ళేది. అబ్దుల్లాపూర్ మెట్ లోని సెంట్రల్ బ్యాంక్ కు వెళుతున్నానని చెప్పి శనివారం ఉదయం 10:45 గంటలకు బస్సెక్కి వెళ్ళింది. కొంత సమయానికి తన భర్తకు అనుమానం వచ్చి సెంట్రల్ బ్యాంకుకు వెళ్లి చూడగా బ్యాంకుకు సెలవు అని తెలిసింది.

భుజంగాచారి తన భార్యకు ఆరోగ్యం, శారీరక ఇబ్బందితోపాటు ఇతర సమస్యలు ఉన్నాయనే మనస్తాపనతో వెళ్లిన‌ట్టు గ్రహించి ఆదివారం అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కాగా ఇంట్లో వాని రాసిన ఉత్త‌రం దొరికింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement