Tuesday, April 30, 2024

Jai Ganesha: రికార్డు కొట్టిన బండ్లగూడ గణపతి లడ్డూ.. 60.8 లక్షలకు దక్కించుకున్న భక్తులు

గణేశ్​ నవరాత్రులు ముగిశాయి. తొమ్మిది రోజులు విశిష్ట పూజలందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరారు. అయితే.. చివరి రోజు ఘనంగా శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనోత్సవానికి తరలించారు. ఈ సందర్భంగా వినాయకుడి చేతిలో ఉన్న లడ్డూ వేలం విషయంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటిదాకా హైదరాబాద్​ బాలాపూర్​ లడ్డూ వేలం అంటేనే యావత్​ దేశానికి తెలిసిన విషయం.. అక్కడే ఎక్కువ మొత్తంలో వేలంలో దక్కించుకుంటారన్న విషయం తెలుసు..

కానీ, నిన్న సికింద్రాబాద్​ అల్వాల్​లో జరిగిన లడ్డూ వేలం మరింత చర్చకు దారితీసింది. ఈ గణపతి లడ్డూని అల్వాల్​ శ్రీలక్ష్మీ 44.99 లక్షలకు దక్కించుకున్నారు. ఇక, ఇవ్వాల అల్వాల్​ని మించి మరో లడ్డూ ధర పలికింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ కీర్తి రిచ్​మండ్​ విల్లాస్​లోని గణేశ్​ లడ్డూ రికార్డు కొట్టిందనే చెప్పవచ్చు. దీన్ని 60.8 లక్షలకు అక్కడి భక్తులు దక్కించుకున్నారు. ఇప్పటికైతే ఇదే హయ్యెస్ట్​ వేలంగా చెబుతున్నారు.​

Advertisement

తాజా వార్తలు

Advertisement