Monday, April 29, 2024

అనంతపురం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో – పుల్లెల గోపీచంద్

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పుల్లెల గోపీచంద్ అనంతపురం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లోని పరేడ్ మైదానం, పోలీసు నర్సరీ, ఇండోర్ స్టేడియంలను సందర్శించారు. పోలీస్ పరేడ్ మైదానంలో పచ్చదనం వెల్లివిరుస్తుండటం, నర్సరీ పలు మొక్కలు- వాటి సంరక్షణ, సౌకర్యవంతంగా ఉన్న ఇండోర్ స్టేడియంను చూసి మెచ్చుకున్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కనుసన్నలలో వీటి నిర్వహణ బాగుందని వ్యక్తం చేశారు. పుల్లెల గోపీచంద్ తో పాటు ఏ.ఆర్ అదనపు ఎస్పీ హనుమంతు, డీసీఆర్బి సి.ఐ విశ్వనాథచౌదరి, ఆర్ ఎస్ ఐ లు రాజశేఖర్ రెడ్డి, భాస్కర్ లు వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement