Thursday, May 16, 2024

కోడుమూరు ఎమ్మెల్యేకు షాక్.. ప్రసంగాన్ని అడ్డుకున్న మహిళలు

కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డా.సుధాకర్ కు మహిళలు షాక్ ఇచ్చారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. గూడూరు మున్సిపాలిటీలో సున్నా వడ్డీ పథకం కార్యక్రమంలో భాగంగా కోడుమూరు ఎమ్మెల్యే డా.సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి, మహిళల అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తోందని చెబుతుండగా.. పొదుపు మహిళలు పైకి లేచి ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్నారు. రూ.మూడు వేలు ఇచ్చి గొప్పలు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా లేవు అని, బురద నీరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం సరిగా లేవు అని, గ్యాస్ తోపాటు నిత్యావసర సరుకుల ధరలు పెంచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు వేల రూపాయలు ఇచ్చి వేలకు వేలు పన్నులు వేస్తున్నారని మండిపడ్డారు. పన్నులు ఎలా కట్టాలి అంటూ ఎమ్మెల్యేను మహిళలు నిలదీశారు. మహిళల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపిసి ఎమ్మెల్యే సుధాకర్ వెనుతిరిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement