Sunday, May 5, 2024

మంచు తుఫాన్.. ఆరుగురు ప‌ర్యాట‌కులు మృతి

మంచు చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి.ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు ప‌ర్యాట‌కులు మృతి చెందారు. సిక్కిం నాథూలా సరిహద్దు వద్ద మంచుచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో 12 మందికి గాయాలయ్యాయి. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సిక్కిం పోలీసులు, రాష్ట్ర టూరిజం అధికారులు, ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ సిబ్బంది ఈ సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. నేడు మధ్యాహ్నం తర్వాత ఈ ప్రాంతంలో ఒక్కసారిగా మంచు తుపాను సంభవించింది. పర్యాటకులు తప్పించుకునేలోపే వారిని భారీ మంచుచరియలు కప్పేశాయి. మంచు కింద ఇంకా చాలామంది పర్యాటకులు ఉండే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 22 మందిని కాపాడారు.ఇంకా స‌హాయ‌క‌చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement