Monday, May 6, 2024

అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి కొవిడ్ పాజిటివ్

తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యింది. ఈరోజు (మంగ‌ళ‌వారం) జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో కొవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. దీంతో ఆయ‌న‌కు పాజిటివ్ గా రిజల్ట్ వచ్చింది. తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాన‌ని, క‌రోనా సోక‌డంతో కొన్ని రోజులు హోం ఐసోలేషన్ లో ఉండనున్న స్పీకర్ పోచారం తెలిపారు. కొన్ని రోజులుగా తనను కలిసిన, తనతో సన్నిహితంగా ఉన్న వారంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏమైనా లక్షణాలు ఉంటే కొవిడ్ టెస్ట్ చేయించుకుని త‌గిన ట్రీట్‌మెంట్ తీసుకోవాల‌ని స్పీకర్ పోచారం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement