Friday, May 3, 2024

సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు అసోం సీఎం కౌంటర్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ.. రాజీవ్ గాంధీ కుమారుడే అని చెప్పడానికి బీజేపీ ఎప్పుడైనా రుజువులు అడిగిందా? అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. హిమంతను సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంత దిగజారి మాట్లాడతారా? అంటూ మండిపడ్డారు. రాహుల్ నానమ్మ ఇందిర, తండ్రి రాజీవ్ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశారని, రాహుల్ తాత నెహ్రూ ప్రధానిగా పని చేశారని… అలాంటి కుటుంబం గురించి ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. ఇదేనా బీజేపీ మాట్లాడే ధర్మం, హిందుత్వం అని ప్రశ్నించారు.

అయితే, కేసీఆర్ వ్యాఖ్యలకు హిమంతి బిస్వా కౌంటర్ ఇచ్చారు. సర్జికల్ స్ట్రయిక్స్ పై రాహుల్ ఆధారాలు అడిగారని, బిపిన్ రావత్ మరణంపై వ్యాఖ్యలు చేశారని… అలాంటి వ్యక్తి గురించి తాము మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబంపై విమర్శలు చేయకూడదా? అని అడిగారు. కేసీఆర్ కు కేవలం తాను మాట్లాడిందే తప్పుగా అనిపించిందా? అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement