Wednesday, May 15, 2024

Covid Flash: దేశంలో భారీగా తగ్గిన కరోనా.. 24 గంటల్లో 44 వేల కేసులు

భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. నిన్నటి కంటే ఈరోజు కేసుల మరింత తగ్గాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 44,877 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,26,31,421కి చేరింది. కరోనాతో మరో 684 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మొత్తం 5,08,665 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం దేశంలో 5,37,045 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,17,591 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,15,85,711కి చేరింది. దేశంలో రోజు వారీ పాజివిటి రేటు 3.17 శాతంగా ఉంది. ఇప్పటివరకు మొత్తం 1,72,81,49,447 కరోనా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement