Tuesday, May 14, 2024

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం.. ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ . ఢిల్లీలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వార్డుల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తునట్లు తెలిపారు. ఒవైసీ పలు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఎవరూ పట్టించుకోని, అభివృద్ధికి నోచుకోని వార్డుల్లో తమ అభ్యర్థులతో పోటీ చేయిస్తున్నామన్నారు. గుజరాత్ వెళ్లండి, లేకపోతే ఢిల్లీలోని సీలంపూర్ వెళ్లండి… అక్కడ అభివృద్ధి కాదు కదా, కనీసం పాఠశాలలు కూడా నిర్మించలేదు, పారిశుద్ధ్యం అంతకన్నా లేదు అని విమర్శించారు. ఈ సందర్భంగా ఒవైసీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై విమర్శలు చేశారు. కేజ్రీవాల్ ‘చోటా రీచార్జ్’ లాంటివాడని ఎద్దేవా చేశారు. గతంలో ఇక్కడ జరిగిన తబ్లిగి జమాత్ కార్యక్రమాన్ని కేజ్రీవాల్ తప్పుబట్టాడని, తబ్లిగి జమాత్ వల్లే కొవిడ్ వ్యాపించిందని కేజ్రీవాల్ అపనింద మోపాడని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement