Monday, April 29, 2024

ఏపీలో క్యాసినో వివాదం – ప‌ట్టువీడ‌ని టిడిపి

ఏపీలో ఇప్పుడు క్యాసినో వివాదం న‌డుస్తోంది. ఈ మేర‌కు టిడిపి నేత‌లు ర‌చ్చ చేస్తున్నారు. కాగా వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ కూడా ఈ విష‌యంపై స్పందిస్తూ దివంగ‌త నటుడు సీనియ‌ర్ ఎన్టీఆర్ ని లాగారు. ఇక మంత్రి కొడాలి నాని ఆధ్వ‌ర్యంలో క్యాసినో వివాదం తెర‌పైకి వ‌చ్చింది. దాంతో మంత్రివ‌ర్గం నుండి బ‌ర్తర‌ఫ్ చేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో మంత్రికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఎంత రచ్చ చేయాలో అంతా చేస్తున్నాయి. ఇది సరిపోదన్నట్లుగా జాతీయస్థాయి దర్యాప్తు సంస్ధలకు కూడా మంత్రిపై ఫిర్యాదు చేయాలని తాజాగా టిడిపి వ్యూహ కమిటి నిర్ణయించింది. క్యాసినో వివాదాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్ళటం ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను అందరికీ తెలిసేట‌ట్టు చేయాలన్నది టీడీపీ ఆలోచన. గుడివాడకు పార్టీ తరపున నిజనిర్ధారణ కమిటీ వెళ్లడం ఆ సమయంలో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవటం లాంటి ఘటనలపైన కూడా సమావేశం చర్చించింది.

క్యాసినో వివాదాన్ని నిజనిర్ధారణ కమిటీ నేతలు బాగా హైలైట్ చేస్తున్నట్లు నేతలను టిడిపి అధినేత చంద్రబాబు అభినందించారు. ఈ క్యాసినో వివాదం చివరకు ఎలా ముగుస్తుందో తెలీదుకానీ ప్రస్తుతానికైతే అధికార-ప్రతిపక్షాల నేతల మధ్య సవాళ్ళు-ప్రతిసవాళ్ళతో రాజకీయ కాలుష్యం పెరిగిపోతోంది. టీడీపీ వ్యవహారం చూస్తుంటే క్యాసినో వివాదాన్ని ఇక్కడితో వదిలి పెట్టకూడదనే అనుకుంటున్నట్లు అనుమానంగా ఉంది. ఎందుకు తెలుగుదేశం దీనిని సీరియస్ గా తీసుకుంది అంటే… క్యాసినో అనేది దేశంలో ప్రత్యేక అనుమతి ఉన్న టూరిజం ప్రాంతాల్లో తప్ప మిగతా చోట్ల నిషేధం. ఇది కేంద్రం కూడా సీరియస్ గా తీసుకునే అంశం. అందుకే చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వైసీపీ నేతను ఇరికించాలని టీడీపీ చూస్తోంది. మ‌రి ఏం జ‌ర‌గ‌నుందో కానీ దీని వ‌ల్ల టిడిపికి ఏ మేర‌కు మేలు జ‌రుగుతుందో వేచి చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement