Monday, May 20, 2024

భారత్‌లో త్వరలోనే మూడో వ్యాక్సిన్‌..

భారత్‌లో త్వరలోనే మూడో కరో నాటిక అందుబాటులోకి రానుంది. కరోనా నివారణకు రష్యా రూపొందించిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ వినియోగానికి భారత్‌లో త్వరలోనే అనుమతి లభించే అవకాశం ఉన్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఏపీఐ, సర్వీసెస్‌ సీఈఓ దీపక్‌ సప్రా తెలిపారు. మరికొన్ని వారాల్లో భారత్‌లో వినియోగానికి అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్‌లో ఈ టీకాను సరఫరా చేసేందుకు ‘రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌‌ ఫండ్ ‌(ఆర్‌డీఐఎఫ్‌)’తో డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా భారత్‌లో రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించారు. తొలి డోసు ఇచ్చిన తర్వాత 21వ రోజు రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. 28 నుంచి 42 రోజుల మధ్య కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుందని వివరించారు. భారత్‌, రష్యా, యూఏఈ సహా మరికొన్ని దేశాల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement