Sunday, May 19, 2024

తెలంగాణ‌కు మ‌రో భారీ ప్రాజెక్ట్.. 200 కోట్ల‌తో టీకాల త‌యారీ కేంద్రం

తెలంగాణ రాష్ట్రానికి మ‌రో భారీ ప్రాజెక్ట్ రానుంది. హైద‌రాబాద్‌లో భార‌త్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్ (బీవీఎస్) సంస్థ జీనోమ్ వ్యాలీలో 200 కోట్ల రూపాయ‌ల‌తో టీకాల త‌యారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌నుంది. ఈ మేర‌కు ఆ సంస్థ ఎండీ సంజీవ్ నావ‌న్ గుల్‌.. రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో క‌లిసి ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు.

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొచ్చినందుకు ఎండీ సంజీవ్ నావ‌న్ గుల్‌కు మంత్రి కేటీఆర్ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ చ‌ర్య‌తో ప్ర‌పంచంలోనే వ్యాక్సిన్ హ‌బ్‌గా హైద‌రాబాద్ న‌గ‌రం త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకుంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement