Sunday, April 28, 2024

Breaking | బిడ్డ మీద కోపం.. ఊళ్లో ఇండ్ల‌కు నిప్పు!

న‌ర్సంపేట‌, (ప్ర‌భ న్యూస్‌): బిడ్డ మీద కోపంతో ఇండ్ల‌కు నిప్పు పెట్టాడో పెద్ద‌మ‌నిషి. ఈ ఘ‌ట‌న వ‌రంగ‌ల్ జిల్లాలో ఇవ్వాల (బుధ‌వారం) జ‌రిగింది. నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలో ప్రేమ పెళ్లి అగ్గి రాజేసింది. గ్రామానికి చెందిన జలిగం రంజిత్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన మండల కావ్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు.

ఇది గమనించిన అమ్మాయి తండ్రి గ్రామంలో త‌నకున్న‌ పలుకుబడితో గ్రామానికి చెందిన నలుగురి ఇండ్ల‌ను ధ్వంసం చేసి, అగ్నికీలలు రాజేశాడు. అబ్బాయికి సంబంధించిన సన్నిహితుల ఇండ్ల‌ను పక్క వ్యూహంతో ధ్వంసం చేసి, నిప్పు పెట్టిన సంఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement