Friday, May 3, 2024

ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా.. కొత్తగా 1601 మందికి వైరస్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 71,532 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1601 కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వైరస్‌ తో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 1,201 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా… ప్రస్తుతం 14,061 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొవిడ్‌తో చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందగా… తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, పశ్చిమగోదావరి, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకరు చొప్పున చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 13,766కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 20,06,191 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 19,78,364 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

ఇది కూడా చదవండిః దేశంలో కరోనా డెల్టా ప్లస్ దడ.. బయటపడుతున్న కొత్త కేసులు!

Advertisement

తాజా వార్తలు

Advertisement