Thursday, May 2, 2024

ఏపీలో కరోనా మరణ మృదంగం.. ఒక్కరోజులో 108 మంది మృతి

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 86,878 కరోనా శాంపిళ్లను పరీక్షించగా ఏకంగా 20,345 కేసులు నమోదయ్యాయి. ఇక కొత్తగా 108 మంది చనిపోయినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. వీటితో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,22,934కి చేరుకోగా.. మరణాల సంఖ్య 8,899కి చేరింది.

ప్రస్తుతం ఏపీలో 1,95,102 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు: శ్రీకాకుళం-1,457, విజయనగరం-744, విశాఖ-2,371, తూ.గో.-1,527, ప.గో.-1,549, కృష్ణా-948, గుంటూరు-1,919, ప్రకాశం-1,130, నెల్లూరు-1,673, చిత్తూరు-2,426, అనంతపురం-1,992, కడప-1,902, కర్నూలు-707.

Advertisement

తాజా వార్తలు

Advertisement