Friday, April 26, 2024

ఏపీలో కొత్తగా 540 కరోనా కేసులు

ఏపీలో ఇంకా కరోనా కేసులు తగ్గుముఖం పట్టలేదు. గురువారం మరో 540 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 540 కరోనా కేసులతోపాటు 10 కరోనా మరణాలు కూడా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

అలాగే కొత్తగా కరోనా నుంచి 557 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 6,588 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 40,350 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement