Thursday, May 2, 2024

అమితాబ్‌ బచ్చన్‌కు మరోసారి కరోనా పాజిటివ్

బాలీవుడ్‌ నటుడు, బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి కరోనా బారినపడ్డారు. దీంతో ఆయన దవాఖానలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల తనను కలిసినవారు కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ‘నాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. గత కొన్నిరోజులుగా తనతోపాటు ఉన్నవారంతా పరీక్ష చేయించుకోండి’ అని ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.


అమితాబ్‌ ప్రస్తుతం సోనీటీవీ రూపొందిస్తున్న కౌన్‌బనేగా కరోడ్‌పతి 14వ సీజన్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తున్నది. 2020 జులై 11న అమితాబ్‌కు మొదటిసారిగా కరోనా సోకిన విష‌యం తెలిసిందే. అయితే అమితాబ్ బ‌చ్చ‌న్ మరోసారి కరోనా బారినపడటంతో ఆయన అభిమానులతోపాటు బాలీవుడ్‌లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆయన తొందరగా కోలుకోవాలని వేడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement