Friday, April 19, 2024

అమితాబ్ బ‌చ్చ‌న్ కి మ‌రోసారి క‌రోనా-హాస్ప‌ట‌ల్ లో చికిత్స‌

క‌రోనా మ‌హ‌మ్మారి జాడ‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇప్ప‌టికే క‌రోనా బారిన ప‌డిన వారిలో చాలామంది మ‌ళ్ళీ ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నారు. కాగా మ‌రోసారి క‌రోనాబారిన ప‌డ్డారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్.. ఇటీవల తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ట్విట్ట‌ర్ ద్వారా సూచించారు. ‘బిగ్ బీ’కి కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు స్పందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. అమితాబ్ ప్రస్తుతం ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’ 14వ సీజన్ షూటింగులో ఉన్నారు. అలాగే, కీలక పాత్రలో నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్, నాగార్జున, మౌనిరాయ్ తదితరులు నటిస్తున్నారు. అలాగే, ‘గుడ్‌బై’, ‘ఊంచాయి’ సినిమాల్లోనూ నటిస్తున్నారు. రష్మిక మందన్నతో కలిసి మరో సినిమాలో కనిపించబోతున్నారు. కరోనా బారినపడిన అమితాబ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement