Wednesday, May 15, 2024

జడ్​ కెటగిరీ సెక్యూరిటీ కల్పిస్తాం, వద్దనొద్దు.. రాజ్యసభలో హోమ్​ మంత్రి అమిత్​ షా

ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ కేంద్రం ఇస్తున్న జడ్​ కెటగిరీ సెక్యూరిటీని అంగీకరించాలని ఇవ్వాల రాజ్యసభలో కేంద్ర హోమ్​ మంత్రి అమిత్​ షా కోరారు.  దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని, యూపీ ప్రభుత్వం నుంచి నివేదిక కూడా కోరామని షా తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారన్నారు. ఒక కారు, రెండు పిస్టల్‌లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై ఫోరెన్సిక్ బృందం విచారణ జరుపుతోందని, ఇద్దరు వ్యక్తులను ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు ఆయన చెప్పారు.

కాగా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జడ్​ కెటగిరీ భద్రతను అంగీకరించడానికి ఒవైసీ నిరాకరించినందున ఎంపీని మరోమారు అభ్యర్థిస్తున్నట్లు షా చెప్పారు. ఢిల్లీలో బుల్లెట్ ప్రూఫ్ కారుతో పాటు ఆల్ ఇండియా ప్రాతిపదికన అతనికి Z కేటగిరీ CRPF భద్రతను అందిస్తామని అమిత్​ షా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement