Wednesday, May 1, 2024

బిజెపి విజ‌య సంక‌ల్ప స‌భ‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా – చేవేళ్ల నుంచి LIVE

చేవేళ్ల – తెలంగాణ బిజెపి చేవేళ్ల‌లోని కేవీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన విజ‌య సంక‌ల్ప‌ బ‌హిరంగ స‌భ‌లో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటున్నారు.. అంత‌కు ముందు ఆయ‌న ఢిల్లీ నుంచి విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. శంషాబాద్ నుండి రోడ్డు మార్గంలో బ‌య‌లుదేరి చేవెళ్ల బహిరంగ సభ ప్రాంగ‌ణానికి చేరుకున్నారు… శంషాబాద్ చేరుకున్న అమిత్ షాకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, సీనియర్ నేత లక్ష్మణ్ తదితరులు స్వాగతం పలికారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పైన బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. కాగా, అమిత్ షా రాక నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పలు మార్గాల్లో ఆంక్షలు విధించారు. ఈ బ‌హిరంగ స‌భ‌ను ప్ర‌త్య‌క్ష్యంగా తిల‌కించండి..

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement