Sunday, April 28, 2024

అక్ర‌మాస్తుల ఆరోప‌ణ‌లు-21మంది ప్ర‌భుత్వ అధికారుల ఇళ్ళ‌పై ఏసీబీ దాడులు

అక్ర‌మాస్తులు క‌లిగి ఉన్నార‌న్న ఆరోప‌ణ‌లు రావ‌డంతో 21మంది ప్ర‌భుత్వ అధికారుల ఇళ్ల‌పై ఏసీబీ దాడులు నిర్వ‌హిస్తోంది. క‌ర్ణాట‌క అసెంబ్లీకి వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అవినీతి అధికారులపై కర్ణాటక ప్రభుత్వం కొరఢా ఝులిపించింది. రాష్ట్రవ్యాప్తంగా 80 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నది. ఈ దాడుల్లో మూడు వందల మంది అధికారులు పాల్గొన్నారు. పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

2018లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి అధికారం రాకపోవడంతో కాంగ్రెస్‌, మాజీ ప్రధాని దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్‌ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే కూటమిలో చీలిక రావడంతో ఏడాది కాలంలోనే ఆ ప్రభుత్వం పడిపోయింది. అనంతరం యెడియూరప్ప సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే అవినీతి ఆరోపణలు రావడంతో బీజేపీ అధినాయకత్వం ఆయనను పదవినుంచి తొలగించి బస్వరాజ్‌ బొమ్మైని ముఖ్యమంత్రిని చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement