Sunday, April 28, 2024

కేసీఆర్ ను ఎదుర్కోలేకే నాపై ఆరోప‌ణ‌లు.. సుఖేష్ పై క‌విత విమ‌ర్శలు

కేసీఆర్ ను ఎదుర్కోలేకే తనపై ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ వరుసపెట్టి లేఖలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో చేసిన ఛాటింగ్‌ అంటూ అతను విడుదల చేసిన స్క్రీన్ షాట్లు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో సుఖేష్ లేఖ‌పై కవిత స్పందించారు. బీఆర్ఎస్ పార్టీపై ఉద్దేశ్యపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకే తనను టార్గెట్ చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సుఖేష్‌ తో తనకు ఎలాంటి పరిచయం లేదని.. ఫేక్ ఛాట్‌లతో దుష్ప్రచారం చేస్తున్నారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement