Saturday, May 4, 2024

Breaking: కాషాయ ఉగ్రవాదులను చంపేస్తాం.. హెచ్చరికలతో కూడిన లేఖ విడుదల చేసిన అల్​ఖైదా

కాషాయ తీవ్రవాదులను బతకనీయం.. ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్, గుజరాత్​ రాష్ట్రాల్లో ఆత్మాహుతి దాడులు చేస్తాం అని అల్​ఖైదా ఉగ్రవాద సంస్థ ఇవ్వాల ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ రిలీజ్​ చేసిన లేఖ ఒకటి సోషల్​ మీడియాలో హల్​చల్​ అవుతోంది. అయితే ఈ లేఖ ఈ నెల 6వ తేదీన రిలీజ్​ చేసినట్టు తెలుస్తోంది. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో వివాదం చెలరేగిన నేపథ్యంలో ఇది వెలుగులోకి వచ్చింది.

‘‘మా ప్రవక్తను అవమానించేవారిని మేము వదిలిపెట్టం, చంపేస్తాం.. మా ప్రవక్తను అవమానించే ధైర్యం చేసే వారి దేహాలను పేల్చివేయడానికి మా శరీరాలతో, మా పిల్లల శరీరాలతో పేలుడు పదార్థాలను నింపుకొని వస్తాం..  కాషాయ ఉగ్రవాదుల అంతం కోసం మా ప్రయత్నాలు కొనసాగుతాయి. బొంబాయి, యూపీ, గుజరాత్​లో ఇవి జరుగుతతాయి ” అని ఆ లేఖలో పేర్కొన్నారు.

కొద్ది రోజులుగా మలేషియా, కువైట్ , పాకిస్తాన్ వంటి అనేక దేశాలు ప్రవక్త ముహమ్మద్ పై కొంతమంది బిజెపి నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండించాయి. ఒక టీవీ చర్చ సందర్భంగా నుపుర్ శర్మ ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. మరో బీజేపీ నాయకుడు నవీన్ జిందాల్ కూడా ట్విట్టర్‌లో వివాదాస్పద వ్యాఖ్యను పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement