Friday, May 10, 2024

ఎయిరిండియా ఫ్లైట్​లో టెక్నికల్​ ఫాల్ట్​.. గాల్లోకి లేచిన 10 నిమిషాల్లోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్​

ఎయిరిండియా విమానంలో ఇవ్వాల రాత్రి (సోమవారం) సాంకేతిక లోపం తలెత్తింది. కేరళ రాష్ట్రం కన్నూర్ విమానాశ్రయంలో ఈ సమస్య తలెత్తింది. విమానాశ్రయం రన్​వే నుంచి గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే పైలట్​ సమస్యను గుర్తించాడు. దీంతో తిరిగి కన్నూర్​ ఎయిర్​పోర్టుకే తీసుకొచ్చి  అత్యవసరంగా ల్యాండ్ చేశాడు.

అయితే.. కోజికోడ్-కన్నూరు-ఢిల్లీ విమానం కన్నూర్ నుంచి బయలుదేరిన 10 నిమిషాల్లోనే తిరిగి రావడం, ఎమర్జెన్సీ ల్యాండింగ్​ కావడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అత్యవసర ప్రయాణాల పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. ఈ క్రమంలో తాము ప్రత్యామ్నాయ విమానాన్ని అందించలేమని ఎయిరిండియా ప్రకటించడంతో వారు నిరసనకు దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement