Thursday, May 16, 2024

టి 20 ర్యాంకింగ్స్‌లో భారత్‌ అగ్రస్థానం.. తర్వాతి స్థానంలో ఇంగ్లండ్‌

టి 20 తాజా ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది ఐసిసి . తాజాగా సిరీస్‌ గెలిచిన భారత్‌ 268 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్‌ 7 పాయింట్లు వెనకబడిపోయి తర్వాతిస్థానంలో ఉంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌ గెలిచి ఉత్సాహం మీద ఉంది టీమ్‌ ఇండియా. తాజాగా మరో వార్త భారత జట్టును , టీమ్‌ ఇండియా అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఐసిసి ప్రకటించిన టీ 20 ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచింది టీం ఇండియా.

హైదరాబాద్‌ వేదికగా భారత్‌ ఆసిస్‌ సిరీస్‌ జరిగిన ఆఖరి మ్యాచ్‌లో టీం ఇండియా అద్భుత ప్రదర్శన చేసింది. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. నాగ్‌ పూర్‌ ఓటమికి ప్రతీకారంగా తర్వాతి రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో టీమిండియా 268 పాయింట్లకు చేరింది. తర్వాతి స్థానంలో ఇంగ్లాండ్‌ నిలిచింది. వరల్డ్‌ కప్‌ రానున్న తరుణంలో సౌతాఫ్రికాతో సెప్టెంబర్‌ 28 నుంచి జరుగనున్న సిరీస్‌లో ఇలాంటి ప్రదర్శన చేసి ర్యాంకింగ్‌ లీడ్‌ను కొనసాగించే అవకాశం టీమ్‌ ఇండియాకు దక్కింది. ఆదివారం పాకిస్తాన్‌ ఇంగ్లండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ ఓడిపోవడం.. ఇండియా ర్యాంకింగ్‌ మెరుగుపడటానికి కలిసొచ్చింది.

ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌ పాయింట్ల వారిగా..

దేశం మ్యాచ్‌లు పాయింట్లు రేటింగ్‌
ఇండియా : 52 – 13,939 – 268
ఇంగ్లండ్‌ : 38 – 9936 – 261
సౌతాఫ్రికా : 34 – 8,787 – 258
పాకిస్థాన్‌ : 40 – 10,328 – 258
న్యూజిలాండ్‌ : 38 – 9, 594 – 252
ఆస్ట్రేలియా : 39 – 9, 761 – 250

Advertisement

తాజా వార్తలు

Advertisement