75వ ఇండిపెండెన్స్ డే ని పురస్కరించుకుని నటి పూనమ్ కౌర్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ని కలిసింది .. 75వ ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్తో కలిసి పూనమ్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిశారు. ఆయన్ని కలవడం చాలా సంతోషంగా అనిపించిందని వెల్లడించారు. అంతే కాదు పూనమ్ కౌర్ మన్మోహన్ సింగ్ తో పాటు ఆయన సతీమణి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక్కడికి రావడం… ఆయన్నకు కలవడం కలగా ఉందని చెప్పారు. అంతే కాదు మన్మోహన్ సింగ్ ఇంట్లో ఆమె క్లిక్ మనిపించిన ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా పూనమ్ కౌర్ ఓ నోట్ కూడా రాశారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని గౌరవ పూర్వకంగా కలిశాను. చాలా సంతోషంగా ఉంది. 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఖాదీ తిరంగాను బహూకరించాను. పాకిస్థాన్ లోని గురుద్వారా దగ్గర తీసుకున్న ప్రత్యేకమైన గులకరాళ్ళ బాక్స్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చాను. దానికి ఆయన పేరు కూడా పెట్టారు అని పూనమ్ వివరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement