Wednesday, May 8, 2024

మునుగోడు అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం : మంత్రి జగదీష్ రెడ్డి

మునుగోడులో టీఆర్‌ఎస్‌ పార్టీనే ఘన విజయం సాధిస్తుందని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండలో పలు అభవృద్ధి కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. అలాగే మర్రిగూడ బైపాస్ జంక్షన్, క్లాక్ టవర్ సెంటర్‌ను కూడా ప్రారంభించారు. 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మునుగోడు అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని అక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తునారు. బీజేపీకి అక్కడ మూడో స్థానమే దక్కుతుందన్నారు.బీజేపీపై పోరాటంలో కేసీఆర్ ది రాజీలేని పోరాటం అన్నారు. బీజేపీ దుర్మార్గాలను, మోదీ అసమర్థ పాలనను ఎండగట్టడంలో సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులు ఐక్యం కావాలని వామపక్షాలు కోరుతున్నాయి. బీజేపీపై పోరాటంలో టీఆర్ఎస్‌తో వామపక్షాలు కలిసి రావాలన్నారు. మునుగోడులో బీజేపీని ఓడించడమే లక్ష్యమని సీపీఎం, సీపీఐలు ప్రకటించడం ఆహ్వానించ తగ్గ పరిణామం అన్నారు. వామపక్షాలు కలిసి వస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement