Thursday, May 2, 2024

అసభ్యంగా ట్రోల్​ చేస్తున్నారని నటి పవిత్ర లోకేశ్​ ఫిర్యాదు.. 15 యూట్యూబ్​ చానెళ్లకు నోటీసులు జారీ

సోషల్‌ మీడియాలో తనపై అసభ్యంగా పోస్టులు పెడుతూ.. ట్రోలింగ్ చేస్తున్నారని నటి పవిత్ర లోకేశ్​ సైబర్‌ క్రైమ్స్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను, నటుడు నరేశ్‌ను మానసికంగా వేధిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇట్లాంటి ట్రోలింగ్​ని ఆపేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యపదాలతో వేధిస్తున్నారని కంప్లైంట్ లో పేర్కొన్నారు. పవిత్ర లోకేశ్ చేసిన ఫిర్యాదుతో సైబర్​ క్రైమ్స్​ పోలీసులు యాక్షన్​లోకి దిగారు. ఆదివారం 15 యూట్యూబ్ ఛానళ్లకు నోటీసులు జారీ చేశారు. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వెబ్‌సైట్స్‌కి కూడా నోటీసులు పంపారు. మూడు రోజుల్లో విచారణకు హాజరవ్వాలని సూచించారు.

పవిత్ర, నరేష్ .. ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారు. దీనిపై అధికారికంగా స్పందించనప్పటికీ చాలా రోజులుగా కలిసే ఉంటున్నారు. నరేష్‌, పవిత్ర.. సోషల్‌ మీడియాలో వీళ్లిద్దరిపై ట్రోలింగ్​ జరుగుతోంది. మైసూర్‌లోని ఓ హోటల్‌లో ఉన్న వీళ్లను నరేష్‌ మూడో భార్య రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో వీళ్ల రిలేషన్ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుంచి నటులు నరేష్‌ పవిత్రపై సోషల్‌మీడియాలో విపరీతంగా ఆడిపోసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement