Saturday, April 27, 2024

Drug Case: ఈడీ ముందుకు నవదిప్…

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. సోమవారం నటుడు నవదీప్ ను ఈడీ అధికారులు విచారించనున్నారు. మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించి నవదీప్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. డ్రగ్స్ సరఫరాదారు కెల్విన్ తో లావాదేవీలపై ఈడీ ఆరా తీయనున్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ కు సంబంధించి ఈడీ ఇప్పటికే ఏడుగురు సినీ ప్రముఖులను విచారించింది.

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈ నెల 8న హీరో దగ్గుబాటి రానాను ఈడీ విచారణకు హాజరయ్యాడు. నవదీప్ తో ఉన్న సంబందాలు, ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రధానంగా విచారణ విచారించనున్నట్లు తెలుస్తోంది. కాగా,  ఇప్పటివరకు హీరో రవితేజ,  డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మీ, రకుల్ ప్రీతి సింగ్ వంటి టాలీవుడ్ ప్రముఖులు ఈడీ విచారణకు హాజరైయ్యారు. ఎఫ్ కేఫ్ కేంద్రంగా సినీస్టార్స్ కు డ్రగ్స్ సరఫరా అయినట్టు ఈడీ అధికారులు భావిస్తున్నారు. ప్రధాన నిందితుడు కెల్విన్.. సినీ తారలకు అక్కడే డ్రగ్స్‌ సప్లై చేసినట్టుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండిః టీపీసీసీ మరో కొత్త టీం.. కమిటీలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు చోటు

Advertisement

తాజా వార్తలు

Advertisement