Thursday, April 18, 2024

టీపీసీసీ మరో కొత్త టీం.. కమిటీలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు చోటు

తెలంగాణ పీసీసీ కొత్త కార్యవర్గం నియమించిన కొద్దిరోజులకే పార్టీ అధిష్టానం మరో టీంని ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కొద్దికాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి స్థానం దక్కింది. వారితో పాటు పలువురు సీనియర్లు కూడా ఈ కమిటీలో ఉన్నారు.

టీపీసీసీ ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ కన్వీనర్‌గా నియమితులయ్యారు. సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క, సీనియర్లు వి. హనుమంతరావు, జానా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, రేణుకా చౌదరి, బలరాం నాయక్, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, శ్రీధర్ బాబు, పోడెం వీరయ్య, సీతక్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు కమిటీలో చోటు దక్కింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఏఐసీసీ కార్యదర్శులు, ఏఐసీసీ నియమించిన అన్ని కమిటీల చైర్మన్లు, ఇన్చార్జి సెక్రటరీలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.




Advertisement

తాజా వార్తలు

Advertisement