Sunday, May 5, 2024

కార్య‌క‌ర్త చెంప చెళ్లుమ‌నిపించిన – మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

రెవెన్యూశాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు స‌హ‌నం కోల్పొయారు. దాంతో ఓ కార్య‌క‌ర్త చెంప చెళ్ళుమ‌నిపించారు. ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకు సౌమ్ముడిగా పేరుంది. అయితే అంత‌టి సౌమ్యుడు కూడా తాజాగా స‌హ‌నం కోల్పోయి త‌న‌కు స్వాగ‌తం చెప్పేందుకు వ‌చ్చిన ఓ కార్య‌క‌ర్త‌పై చేయి చేసుకున్నారు. కెమెరా కంటికి చాలా స్ప‌ష్టంగానే చిక్కిన ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది. కొత్త‌గా మంత్రి ప‌ద‌వి చేపట్టిన త‌ర్వాత శ‌నివారం తొలిసారి త‌న సొంత జిల్లా శ్రీకాకుళంకు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ శ్రేణులు ఆయ‌న‌కు పెద్ద ఎత్తున స్వాగ‌త కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశాయి. ఈ క్ర‌మంలో ఆయ‌న‌తో క‌ర‌చాల‌నం చేసేందుకు కార్య‌క‌ర్త‌లు ఎగ‌బ‌డ‌గా… ఓ కార్య‌క‌ర్త మంత్రి చేయిని గ‌ట్టిగా లాగార‌ట‌. దాంతో.. స‌హ‌నం కోల్పోయిన మంత్రి ధ‌ర్మాన ఆ కార్య‌క‌ర్త నుంచి చేయిని విదిలించుకుని అత‌డిపై చేయి చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement