Friday, May 3, 2024

చెన్నూరులో కృతజ్ఞత సభ, రైతులంతా తరలిరావాలే: ప్రభుత్వ విప్ సుమన్

చెన్నూరు ఎత్తిపోతల పథకానికి 1658 కోట్ల రూపాయలు మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేసేందుకు కృతజ్ఞత సభ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఈనెల 18న సోమవారం చెన్నూరు పాత వ్యవసాయ మార్కెట్ లో నిర్వహించే కృతజ్ఞత సభకు నియోజకవర్గంలోని రైతాంగం పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలోని 90 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, దీంతో చెన్నూరు సస్యశ్యామలం అవుతుందన్నారు సుమ‌న్‌. ఈ కృతజ్ఞత సభకు రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నార‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement