Tuesday, May 21, 2024

పిల్ల‌ల కోసం ఏమైనా చేస్తా.. సహజీవనానికి కూడా రెడీగా ఉన్నా: క‌రాటే క‌ళ్యాణి

పిల్ల‌ల్ని క‌న‌డానికి దేనికైనా సిద్ధ‌మ‌ని చెప్పారు న‌టి క‌రాటే క‌ళ్యాణి. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు పెళ్లిళ్లు చేసుకున్న క‌ళ్యాణి త‌న భ‌ర్త‌ల‌తో విడిపోయి ఒంట‌రిగా ఉంటున్నారు. కాగా తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె తాను అంటే ఏమిటనేది అందరికీ తెలుసని చెప్పారు. భార్య అంటే కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కాదని, తాను అలాంటి మహిళను కాదని అన్నారు. తాను నిప్పునని, అందుకే తన వైవాహిక జీవితాలు మధ్యలోనే ఆగిపోయాయని చెప్పారు. తనను వాళ్లు అర్థం చేసుకోలేదని… గొడవలతో విసిగిపోయి విడాకులు తీసుకున్నానని అన్నారు. ఇప్పుడు ఒంటరిగా హ్యాపీగా ఉన్నానని తెలిపారు.తనకు ఇంత వరకు జీవితంలో నిజమైన ప్రేమ దొరకలేదని… తనకు నిజమైన ప్రేమ దొరికితే మూడో పెళ్లికి సిద్ధమని కల్యాణి చెప్పారు. సరైన అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకుంటానంటే పెళ్లికి తాను సిద్ధమని, సహజీవనానికైనా రెడీ అని తెలిపారు. పిల్లల కోసమే రెండు సార్లు పెళ్లి చేసుకున్నానని, ఆ ఆశ ఇంకా తీరలేదని, ఆ కోరిక తీరాలని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement