Friday, May 10, 2024

Breaking: సిద్దిపేట జిల్లాలో యాక్సిడెంట్‌.. ఒక‌రు మృతి, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

సిద్దిపేట జిల్లాలో ఇవ్వాల (ఆదివారం) కొద్దిసేప‌టి క్రితం యాక్సిడెంట్ జ‌రిగింది. ఒక కారు మీదికి మ‌రో కారు దూసుకెళ్ల‌డంతో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు చ‌నిపోయారు. మ‌రో ఎనిమిది మందికి తీవ్ర గాయాల‌య్యాయి. చిన్నకోడూరు మండలం మల్లారం సమీపంలో ఈ యాక్సిడెంట్​ జరిగింది. కాగా, ప్ర‌మాద బాధితుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. అట్లానే మృతుడు ఎవ‌ర‌నే విష‌యం కూడా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement