Sunday, April 28, 2024

శ్రీవారి మెట్ల పనులు వేగవంతం చేయండి – టిటిడి పాలకమండలి సభ్యులు

తిరుపతి సిటీ – ప్రభ న్యూస్ : శ్రీవారి మెట్లు ప్రాంతంలో చేస్తున్నటువంటి మరమ్మతు పనులు వేగవంతం చేయాలని టిటిడి పాలకమండలి సభ్యులు అశోక్ కుమార్ అన్నారు. ఆయన ఆ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఈ నెల ఏప్రిల్ 30 తేదీ కల్లా శ్రీవారి మెట్లు పనులు పూర్తిచేసి.. శాశ్వత పరిష్కారం లో భాగంగా 3.60 కోట్లతో మరమ్మతు పనులు చేయాలని టిటిడి పాలకమండలి నిర్ణయించిందన్నారు. వరదల సమయంలో శ్రీవారి మెట్లు మార్గాన్ని పరిశీలించనున్నారు. గత ఏడాది నవంబర్ లో కురిసిన అకాల వర్షాల కారణంగా శ్రీవారి మెట్లు నాలుగు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయన్నారు.. మే మొదటివారంలో భక్తులకు అందుబాటులోకి తీసుకుని వస్తామన్నారు. శ్రీవారి మెట్లు ప్రాంతంలో మెట్ట ప్రాంతం కావడంతో మెటీరియల్ తరలించడం చాలా ఇబ్బందిగా ఉండటం వల్ల పనులు కొంత ఆలస్యం అవుతుంది అన్నారు.. ఇప్పటికీ 80 శాతం పనులు పూర్తయిన అన్నారు.. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని టిటిడి పాలకమండలి నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాలిబాట వచ్చే వాళ్లకు దర్శనం టోకెన్లు కేటాయించేలా పాలకమండలి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు..ఈ కార్యక్రమంలో బండ్ల లక్ష్మీపతి. ఇంజనీరింగ్. అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement