Monday, April 29, 2024

Jammu Kashmir : ఘోర రోడ్డుప్ర‌మాదం.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

ఘోర రోడ్డుప్ర‌మాదంలో ఆరుగురు దుర్మ‌ర‌ణం చెంద‌గా, ప‌లువురు గాయాల‌పాలైన ఘ‌ట‌న జమ్మూ కశ్మీర్‌లో చోటుచేసుకుంది. కార్మికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్‌ లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కార్మికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. డంగుదురు పవర్‌ ప్రాజెక్ట్‌ కు చెందిన 10 మంది కార్మికులు క్రూజర్‌ వాహనంలో వెళ్తున్నారు. డంగుదురు డ్యామ్‌ సైట్‌ సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి కిష్త్వార్‌లో లోతైన లోయలోకి బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయడినట్లు కిష్త్వార్‌ పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement