Thursday, May 2, 2024

ఆల్టో కారును ఢీకొన్న లారీ.. ఇద్ద‌రు మృతి.. ఇద్ద‌రికి గాయాలు

కరీంనగర్ జిల్లా మానకొండూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. AP 36 AT 0648 నెంబర్ గల ఆల్టో కారులో వరంగల్ నుండి వేములవాడ వెళ్తున్న ఓ కుటుంబ సభ్యులకు మానకొండూర్ మండలం జాతీయ రహదారిపై జాలగుట్ట సమీపంలో కరీంనగర్ నుండి వరంగల్ వైపు వెళ్తున్న (AP 16 TP 1166) నెంబర్ గల లారీ ఢీకొనగా.. కారులో ప్రయాణిస్తున్న మామిడాల సురేందర్ (42) అక్కడికక్కడే మృతి చెందాడు. ముగ్గురు గాయపడ్డారు.

వారిని మానకొండూర్ పోలీసులు 108 వాహనంలో చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో తీవ్రంగా గాయపడిన మరో మహిళ మామిడాల మాధవి(40) మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. గాయపడిన మామిడాల మేఘన, అశోక్ లను ఆసుపత్రిలో చేర్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న మానకొండూర్ సర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ రాజ్ కుమార్ వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement