Friday, May 17, 2024

Breaking: బీర్ బాటిల్ లో బాంబ్ కలకలం

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో బీర్ బాటిల్ లో బాంబ్ కలకలం చోటుచేసుకుంది. జిల్లాలోని వెంకటాపురం మండలం పామునూరులో గుర్తించారు. పోలీసులు టార్గెట్ గా మావోయిస్టులు అమర్చారు. ఆ మందుపాతరను పోలీసులు నిర్వీర్యం చేశారు. బీరు బాటిల్, వైర్లు, బోల్టులు స్వాధీనం చేసుకున్నారు. ములుగు అడ‌విలో కూబింగ్ నిర్వ‌హించే పోలీసుల‌ను ల‌క్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేయాల‌ని నిర్ణ‌యించారు.

దీనికోసం కొత్త‌త‌ర‌హాగా ఈర‌కం మందుపాత‌ల‌ను ఏర్పాటు చేశారు. వెంక‌టాపురం పామ‌నూర్ అడ‌విలో బీర్ బాటిల్ లో ఐఈడీ లను అమ‌ర్చి మందుపాత‌ర‌ను ఏర్పాటు చేశారు. ఈ త‌ర‌హా మందుపాత‌ర‌ల‌ను చూసి పోలీసులు షాక్ అయ్యారు. స్పెష‌ల్ పార్టీ, సీఆర్సీఎఫ్ బెటాలియ‌న్ పోలీసులు ములుగు ఫారెస్ట్‌లో కూబింగ్ చేయ‌డం మొద‌లుపెట్టారు. అయితే, బీర్ బాటిల్ మందుపాత‌ర‌ల‌ను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయ‌డంతో పెనుప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డారు. దీనిపై మావో అగ్ర‌నేత‌లపై వెంక‌టాపురం పోలీస్ స్టేష‌న్‌లో కేసులు న‌మోదు చేసినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement