Saturday, April 27, 2024

ప్రయాణికులకు గమనిక .. పట్టాలెక్కనున్న 82 రైళ్లు

ప్రయాణికులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. కరోనా కారణంగా నిలిచిపోయిన రైళ్ల సేవలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19 నుంచి విడతల వారీగా 82 రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఇందులో 66 ప్యాసింజర్ రైలు కాగా.. మిగతావి ఎక్స్‌ప్రెస్ రైళ్లు. ఈ నెల 19 నుంచి కొన్ని, 20, 21 తేదీల్లో మరికొన్ని రైళ్లు అందుబాటులోకి వస్తాయి. ఈ రైళ్లన్నీ గతంలో తిరిగిన మార్గంలోనే తిరుగుతాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. రైలు ప్రయాణంలో కొవిడ్ నిబంధనలు కఠినంగా అమల్లో ఉంటాయని దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య స్పష్టం చేశారు. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని, మాస్క్ ధరించాలి అని సూచించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement