Tuesday, May 14, 2024

ఇంట్లో పేలిన పటాకులు..ఏడుగురు దుర్మరణం..

బీహార్‌లోని భగల్పూర్‌ జిల్లాలోని ఓ ఇంట్లో భారీ పేలుళ్లు సంభవించాయి. తాతర్‌పూర్‌లో ఉన్న ఓ ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున పెద్దఎత్తున పేలుడు సంభవించింది. దీంతో ఏడుగురు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. పేలుడు ధాటికి మూడు ఇండ్లు ధ్వసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంధి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కుప్పకూలిన భవనం శిథిలాల కింద పది నుంచి 15 మంది వరకు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. క్షతగాత్రులను మాయాగంజ్‌లోని జేఎల్‌ఎన్‌ ఆస్పత్రికి తరలించగా, అక్కడికి చేరుకునేలోపే నలుగురు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement