Sunday, April 28, 2024

క్ష‌ణం@6 ఇయ‌ర్స్ – ఎమోష‌నల్ అయిన ‘అడ‌వి శేషు’

యంగ్ హీరో అడ‌వి శేషు కేరీర్ లో ప్రేక్షకకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో ‘క్షణం’, ‘ గూఢాచారి’ మూవీలు ఉంటాయి. అయితే క్షణం మూవీ రిలీజై ఈ రోజుతో ఆరేళ్లు గడిచింది. ఈ సందర్భంగా ఆ మూవీ రిలీజ్ అయ్యే రోజు అడివి శేష్ ఎలా ఫీలయ్యాడో ట్విట్టర్ ద్వారా తెలిపాడు. క్షణం మూవీ రిలీజై ఆరేండ్లు పూర్తైంయ్యింది. ప్రసాద్ స్క్రీనింగ్ లో 2016 ఫిబ్రవరి 26న ఉదయం 8:45 గంటలకు ‘క్షణం’తో జీవితం మారియిపోయింద‌న్నాడు. కొన్నేండ్ల తన కష్టానికి ఫలితం దక్కిందంటూ కొంత ఎమోషనలయ్యారు. క్షణం మూవీ ఆరేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీం అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మూవీలో అదా శర్మ , అనసూయ భరద్వాజ్ , వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ మంచి కలెక్షన్స్ ను సాధించింది.

అనేక అవార్డులకు కూడా నామినేట్ అయింది. క్షణం చిత్రానికి గాను శేష్ ఉత్తమ స్క్రీన్ ప్లేకి IIFA అవార్డు మరియు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నంది అవార్డును గెలుచుకున్నాడు. ప్రస్తుతం అడివి శేష్ మేజర్ సినిమాలో నటిస్తున్నారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితానికి సంబంధించిన బయోపిక్ ఇది. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ నటించారు. మే 27న తెలుగు, మలమాళం, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి శశి కిరన్ తిక్క దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహేశ్ బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement