Friday, March 29, 2024

భద్రాచలం ఆలయంలో పొంగులేటి ప్రత్యేక పూజలు

ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి శనివారం ఉదయాన్నే భద్రాచలం సీతారామచంద్రస్వామి వార్లను దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు పొంగులేటిని ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని స్వామివార్లను పొంగులేటి వేడుకున్నారు. స్వామివార్ల దర్శనం అనంతరం భద్రాచలం ఏఎస్పీ రోహిత్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. పొంగులేటి వెంట మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement