దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో దేశంలో 37,379 కేసులు నమోదయ్యాయి. కొవిడ్తో 124 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,82,017కి చేరింది. గడిచిన 24 గంటల్లో 11,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 1,71,830 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దేశంలో రోజువారీ కొవిడ్ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉంది. ఇప్పటివరకు 3,43,06,414 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
మరోవైపు దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 99,27,797 డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,46,70,18,464 కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital