Monday, April 29, 2024

తెలంగాణలో మరో 3 బెస్ట్ టౌన్లు.. ఇండియన్ స్వచ్ఛత లీగ్ (ఐఎస్ఎల్) అవార్డులు

హైదరాబాద్‌: తెలంగాణ పట్టణ ప్రగతి ఫలితాల‌నిస్తోంది. దీంతో రాష్ట్రంలోని మరో మూడు పట్టణాలకు అవార్డులు దక్కాయి. మున్సిపల్ శాఖ చేపట్టిన కార్యక్రమాలు అవార్డుల పంట పండిస్తున్నాయి. తాజాగా మూడు అవార్డులతో కలిపి మొత్తం 19 అవార్డులు దక్కాయి. ఇండియన్ స్వచ్ఛత లీగ్ (ఐఎస్ ఎల్) పోటీల్లో భాగంగా తెలంగాణలోని ఫిర్జాదిగూడ, కోరుట్ల, అలంపూర్ పట్టణాలు అవార్డులకు ఎంపికయ్యాయి. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి రూపా మిశ్రా సీడీఎంఏ ఎన్.సత్యనారాయణకు సమాచారం అందించారు.

ఈ నెల 17న నిర్వహించిన ఇండియన్ స్వచ్ఛత లీగ్ పోటీని నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న పట్టణాల్లో వీటిని ఎంపిక చేశారు. దేశంలోని 1850 పట్టణాలు ఇందులో పాల్గొన్నాయి. వీటిలో తెలంగాణలోని మూడు పట్టణాలు అవార్డులు దక్కించుకున్నాయి. ఇప్పటికే దక్కిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులతో తెలంగాణ పట్టణాలకు 19 అవార్డులు దక్కాయి. 15వేల లోపు జనాభా ఉన్న పట్టణాల కేటగిరిలో అలంపూర్ పట్టణ స్థానిక సంస్థ ఎంపికైంది. 25 వేల నుంచి 50వేల వరకు జనాభా ఉన్న పట్టణాల కేటగిరిలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ , 50వేల నుంచి లక్ష జనాభా ఉన్న కేటగిరిలో కోరుట్ల పట్టణం ఎంపికయ్యాయి. ఈ మూడు పట్టణాలకు ఈనెల 30న ఢిల్లీలో టల్కటోరా స్టేడియంలో జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రధానం చేస్తారు. ఇండియన్ స్వచ్ఛత లీగ్ లో తాజాగా అవార్డు పొందిన పిజ్జాదిగూడ, కోరుట్ల, అలంపూర్ పురపాలికలకు మంత్రి కే తారకరామారావు అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement